రాష్ట్రంలో 1,924 కొవిడ్ కేసులు

byసూర్య | Wed, Apr 07, 2021, 11:51 AM

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. ఇందులో 1,734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 6634 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 , మేడ్చల్‌ 205, నిజామాబాద్‌ 179, రంగారెడ్డి జిల్లాలో 169 చొప్పున ఉన్నాయి. కాగా, నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 74,274 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Latest News
 

వీరభద్రుడి సన్నిధిలో చండీ హోమం Wed, Apr 24, 2024, 10:58 AM
ఆదిలాబాద్ కు తరలిన బీజేపీ నాయకులు Wed, Apr 24, 2024, 10:57 AM
పెళ్లి చేసుకుంటానని మోసం... కేసు నమోదు Wed, Apr 24, 2024, 10:39 AM
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత Wed, Apr 24, 2024, 10:29 AM
వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM