byసూర్య | Wed, Apr 07, 2021, 11:23 AM
నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తున్న మారుతి కారు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా రామచందర్(48) అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.