byసూర్య | Tue, Apr 06, 2021, 04:00 PM
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. కరోనా కారణంగా సంవత్సరం నుంచి జీతాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆర్ధిక విషయాల్లో దంపతుల మధ్య ప్రతిరోజూ గొడవ జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన ప్రైవేట్ టీచర్ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.