byసూర్య | Tue, Apr 06, 2021, 03:29 PM
తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కంటే రాజకీయమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. తుపాకుల ద్వారా ఏం సాధించలేరని హితవు పలికారు. హింస ద్వారా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. హింసను విడనాడాలని కోరారు.