byసూర్య | Tue, Apr 06, 2021, 02:36 PM
తెలంగాణ నుంచి తమిళనాడు వరకు సోమవారం ఉపరితల ద్రోణి ఏర్పడిన విషయం తెలిసిందే. మంగళవారం తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ, నైరుతి తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.