ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన యువకుడు.... !

byసూర్య | Tue, Apr 06, 2021, 02:25 PM

ఫేస్ బుక్ లో కొత్త పరియచం ఓ బాలికను నిండా ముంచింది. ఓ యువకుడిని నమ్మిన బాలిక చిరవకు మోసపోయింది. పేట్ బషీరాబాద్‌లో చోటు చేసుకుంది...  సుచిత్ర సెంటర్ కి చెందిన బాలికను సంగారెడ్డి జిన్నారంకు చెందిన రాహుల్(19) అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. చాటింగ్ చేస్తూ మంచి వాడిలా నటించాడు. ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పాడు. ఇందంతా నిజమని నమ్మిన ఆ బాలికను ఓ రోజు తన వెంట స్వగ్రామానికి తీసుకెళ్లాడా యువకుడు. అక్కడ ఆమె పర్సనల్ ఫోటోలను సెల్ ఫోన్ లో తీసుకున్నాడు. ఆ తర్వాత తనలోని అసలు రంగును బయటపెట్టాడు. తాను అడిగినప్పుడల్లా డబ్బు కావాలని లేకుంటే ఈ ఫోటోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ బాలిక వద్ద నుండి రూ. 57,000 కాజేశాడు. ఏప్రిల్ 3న ఏకంగా బాలిక తండ్రికి ఫోన్ చేసిన రాహుల్ తనకు డబ్బు ఇవ్వాలని, మీ అమ్మాయి పర్సనల్ ఫొటోస్ నా వద్ద ఉన్నాయి అంటూ బెదిరించాడు. దీంతో తండ్రి నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


Latest News
 

చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM
తెలంగాణలో సమ్మర్ హీట్.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ Fri, Apr 19, 2024, 07:42 PM
తెలంగాణలో ఎంపీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఆ అవకాశం కూడా కల్పించిన ఈసీ Fri, Apr 19, 2024, 07:37 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. ఈసారి పోలీసులే Fri, Apr 19, 2024, 07:32 PM