byసూర్య | Tue, Apr 06, 2021, 12:37 PM
తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన మహేందర్ యాదవ్ (30) బావిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. స్వరాష్ట్రం ఏర్పడినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపం చెందిన మహేందర్ యాదవ్.. హైదరాబాద్ కు వెళ్తున్నానని ఇంట్లో నుండి బయలుదేరి మంచినీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మహేందర్ యాదవ్ ప్రస్తుతం తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.