byసూర్య | Tue, Apr 06, 2021, 12:18 PM
తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్ తమిళనాడులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా చెన్నైలోని విరుగంబాక్కమ్ పోలింగ్ కేంద్రంలో గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ భావించినట్టుగానే తమిళనాడులో పోలింగ్ సందడిగా సాగుతోంది. ఉదయాన్నే సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.