తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు

byసూర్య | Mon, Apr 05, 2021, 11:09 AM

భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. భానుడి భగభగలకు జీవజాతులు అల్లాడిపోతున్నాయి. సెగలుకక్కుతున్న సూర్యుడి ప్రతాపానికి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలోనే మండే ఎండలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. రానున్న మూడురోజులూ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని


హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రత 40 నుంచి 43 డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకే వెళ్లవద్దని అధికారులు సూచించారు. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకూ ఎండ అధికంగా ఉంటుందని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య తీవ్రత అధికమని, విదర్భ నుంచి వడగాలులు వీయనున్నాయని అధికారులు హెచ్చరించారు.మంచిర్యాల, పెద్దపల్లి, జయశంక ర్‌ భూపాలపల్లి, ములుగు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని హెచ్చరించారు. చిన్న పిల్లలను బయటకు పంపించవద్దని సూచించారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM