తెలంగాణలో మరో కొత్త పార్టీ అవసరం

byసూర్య | Mon, Apr 05, 2021, 08:32 AM

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశవర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. శనివారం తాండూరులో వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న తెలంగాణ పార్టీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కొత్తగా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు విషయమై రాష్ట్రంలో వివిధ పార్టీల ముఖ్యనాయకులతో మాట్లాడారు. కుదిరితే పార్టీ ఏర్పాటు చేస్తాం.. లేదంటే బీజేపీలో చేరేందుకు 90 శాతం అవకాశం ఉంది అని అన్నారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపిన ఆయన…ఇంతకు ముందు సూచించిన ఆరు అంశాల విషయంలో కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వస్తే మళ్లీ ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలచిస్తానని అన్నారు. జూన్‌లో కాంగ్రెస్‌లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని, దేశంలో ఏ పార్టీ సిద్ధాంతాలు లేవని, బీజేపీ హిందుత్వ పార్టీ అని అన్నారు.


తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి తానే కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇప్పించానని, గెలిచిన తర్వాత ద్రోహం చేశారని ఆరోపించారు. ఇంజనీరింగ్‌ చేశానంటే వ్యాపారంలోనూ భాగస్వామ్యం కూడా ఇచ్చానని, అతను అసలు ఇంజనీరే కాదని అన్నారు. తాను టీఆర్‌ఎస్‌ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ, పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌ పార్టీలో చేరానని అన్నారు. అయితే కాంగ్రెస్‌ పోరాడే తత్వాన్ని మర్చిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని చెప్పుకొచ్చారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM