byసూర్య | Sat, Apr 03, 2021, 12:08 PM
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021-22 సంవత్సరానికి తెలంగాణలో నేడు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. శనివారం కాకతీయ యూనివర్సిటీలో ఐసెల్ కన్వీనర్ ఆచార్య కె. రాజిరెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు ఈనెల 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రవేశ పరీక్ష ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇటీవల ఐసెల్ 2021 షెడ్యూల్ను ఇది వరకే రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేయగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ నేడు విడుదలయ్యే అవకాశం ఉంది.