byసూర్య | Sat, Apr 03, 2021, 12:01 PM
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని దాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో అనేక చర్యలు తీసుకున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. రోజు ఏదో ఒక చోట మద్యం తాగి ప్రమాదాలు చేయడం.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్ అంబర్ పేటలో శనివారం తెల్లవారుజామున 4. 30 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి బైకుపై వెళ్తున్న భార్యభర్తలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య మల్లమ్మ(30) అక్కడికక్కడే మృతి చెందగా భర్త బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆక్సిడెంట్ కు కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.