byసూర్య | Sat, Apr 03, 2021, 11:52 AM
కాకినాడ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. బస్టాండ్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే షార్ట్ సర్య్కూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో 13 మంది ఉన్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని బస్సులో మంటలను ఆర్పివేశారు.