byసూర్య | Sat, Apr 03, 2021, 09:56 AM
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో మరో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజుల్లో మొత్తం 9 మందికి కరోనా సోకింది. క్రైం విభాగంలో పని చేసే ఐదుగురు ఒకేసారి వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఏఎస్ఐ, మహిళా ఐదుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్ వచ్చింది. మొదటి దశ కరోనా సమయంలో బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో 50 మంది వైరస్ బారిన పడ్డారు. రెండో దశ వేగంగా విస్తరిస్తుండటంతో మిగతా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.