byసూర్య | Sat, Apr 03, 2021, 09:29 AM
దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పెట్రో ధరలు వరుసగా నాలుగో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి...ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర 96రూపాయల65 పైసలు వద్ద డీజిల్ ధర 90 రూపాయల 17 పైసలు వద్ద నిలకడగా కొనసాగుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. ఆర్దిక రాజధాని ముంబై లో 96 రూపాయల 98 పైసలుగా నమోదవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి.