శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

byసూర్య | Fri, Apr 02, 2021, 08:28 AM

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారించి వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని తరలిస్తున్నాడు. ప్యాకింగ్ కవర్ల లోపలి పొరలలో బంగారు రేకుల రూపంలో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారాన్ని మరొక వ్యక్తికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.47.63 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM