byసూర్య | Fri, Apr 02, 2021, 08:28 AM
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 1.026 కిలోల బంగారాన్ని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను విచారించి వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు దుబాయ్ నుంచి హైదరాబాద్కు బంగారాన్ని తరలిస్తున్నాడు. ప్యాకింగ్ కవర్ల లోపలి పొరలలో బంగారు రేకుల రూపంలో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారాన్ని మరొక వ్యక్తికి అప్పగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.47.63 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.