byసూర్య | Thu, Apr 01, 2021, 12:04 PM
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ఓ భర్త దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. జానంపేటకు చెందిన కావలి రాములు (35) కొంతకాలంగా తిమ్మాపూర్ కు చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున రాములు ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. రాములును చూసిన ఆ మహిళ భర్త క్షణికావేశంలో అతడిపై దాడి చేశాడు. దీంతో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిపై మహిళ భర్తతో పాటు మరో ముగ్గురు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.