byసూర్య | Thu, Apr 01, 2021, 09:58 AM
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి.