byసూర్య | Wed, Mar 31, 2021, 05:00 PM
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మాపూర్ నుండి గచ్చిబౌలికి స్టీల్ లోడుతో వెళుతున్న లారీని ఔటర్ రింగ్ రోడ్డుపై అప్పా జంక్షన్ సమీపంలో జడ్చర్ల నుండి జహీరాబాద్ కు కీరా లోడ్ తో వెళుతున్న డిసిఎం వెనుకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుమ్మడిదల మండలం లచ్చి రెడ్డి గూడ గ్రామానికి చెందిన డీసీఎం డ్రైవర్, ఓనర్ అరుణ్ చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.