byసూర్య | Wed, Mar 31, 2021, 04:28 PM
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాట్సాప్ లో ఓ వార్త అందరిని ఆశ్చర్యంలోకి పడేసింది. నగర పరిధిలో ప్రయాణించే వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకున్నా పర్వాలేదు ఎటువంటి జరిమానా విధించరు అని ఆ మెసేజ్ సారాంశం. దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది వేసిన పిటిషన్ పై కోర్టు ఈ నిర్ణయం ప్రకటించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది నిజమని నమ్మి హెల్మెట్ లేకుండా గనుక మీరు వెళ్తే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. ఎందుకంటే ఇది పక్కా ఫేక్ న్యూస్. ఈ మెసేజ్ చివరలో ఇచ్చిన ఒక నంబర్ కలవగా అది న్యాయవాది దేవేంద్ర ప్రతాప్ సింగ్దే కావడం గమనార్హం. ఈ నెంబర్ తనదేనని అయితే ఈ మెసేజ్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే తన పేరు మీద ఈ వదంతులు సృష్టించారని, దీన్ని ఎవరూ నమ్మొద్దని సూచించాడు. ఇయితే ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ ఫార్వర్డ్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.