byసూర్య | Wed, Mar 31, 2021, 02:11 PM
కుటుంబ సభ్యుల కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన మంగళవారము మునుగోడు మండలములో చోటుచేసుకుంది. స్థానిక గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండల పరిధిలోని కిష్ఠాపురం గ్రామానికి చెందిన ఉమెంతల కృష్ణ, స్వాతి దంపతులకు గత 5 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కొన్ని సంవత్సరాలుగా ఈ దంపతుల జీవితము సాపిగా జరిగిన గత కొన్ని నెలల నుండి కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. దీనితో విసుగు చెందిన స్వాతి మంగళవారం రోజు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన స్థానికులు ఇరుగుపొరుగు వారు వెంటనే వైద్యం నిమిత్తం కామినేని హాస్పిటల్ కు తరలించగా పరీక్షించిన అక్కడి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాగా చనిపోయిన వివాహితకు పది నెలల పాప గలదు. మృతురాలి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మునుగోడు ఎస్సై రజినీకర్ రెడ్డి తెలిపారు.