byసూర్య | Wed, Mar 31, 2021, 02:01 PM
హైదరాబాద్ : కరోనా వ్యాక్సిన్ రెండో డోస్లో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. బుధవారం నిమ్స్లో గుత్తా రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైరస్ను జనం లైట్ తీసుకుంటున్నారని, మాస్క్ లేకుండా తిరగవద్దని... ప్రభుత్వం పెట్టిన నిబంధనలను పాటించాలని కోరారు. నిమ్స్ సిబ్బందికి గుత్తా ధన్యవాదాలు తెలియజేశారు.