byసూర్య | Wed, Mar 31, 2021, 01:55 PM
కాగజ్ నగర్ పట్టణంలోనిపెట్రోల్ పంపు ఏరియాలోని ఒక స్క్రాబ్ దుకాణంలో మంగళవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దుకాణం పైననే మేయిన్ లైన్ ఉండటంతో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. రెండు గంటలుగా కరెంట్ లేక పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు రెండు గంటల పాటుఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం కలిగినట్టు సమాచారం.