byసూర్య | Wed, Mar 31, 2021, 01:00 PM
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 684 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. కోవిడ్ బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 7 వేల 889కి చేరగా, 1697 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 4, 965 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.