byసూర్య | Wed, Mar 31, 2021, 12:12 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేట చెరువు లో పడి యశ్వంత్ (14) అనే బాలుడు మృతి చెందాడు. తన పిల్లవాడు దోశకంటి యశ్వంత్ కనబడుటలేదని నిన్న రాత్రి దుండిగల్ పోలీసులను బాలుడు తండ్రి రాజు ఆశ్రయించాడు. చెరువు గట్టు పైన సైకిల్ ఉందని స్దానికులు 100 డయల్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు చెరువు లో వెతికి యశ్వంత్ మృత దేహాన్ని బుధవారం ఉదయం వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.