byసూర్య | Wed, Jan 20, 2021, 04:12 PM
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా సోకి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ.లక్ష వరకు రీయింబర్స్ మెంట్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. జీవోను విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.