అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌..పోలీసులకు నోటీసులు

byసూర్య | Wed, Jan 20, 2021, 03:54 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ కోర్టు ఆమెకు బెయిల్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. అయితే, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు భూమా అఖిలప్రియ. ఆమె ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని అఖిల ప్రియ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై పోలీసులకు నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్టు.
తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే గతంలో సికింద్రాబాద్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసి సమయంలో.. అఖిలప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దని.. ఆమె బయటకు వెళ్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని పోలీసులు ఆరోపించారు. అంతేకాదు మరిన్ని ఘటనలకు కూడా పాల్పడే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. అయితే ఈ నోటీసులపై పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM