ఖమ్మంలో ఘోరం

byసూర్య | Wed, Jan 20, 2021, 02:48 PM

ఖమ్మం జిల్లాలో మహిళ దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. మహిళను కిరాతకంగా హతమార్చిన దుండగులు గోనెసంచిలో కుక్కి రైలు పట్టాలపై పడేసిన ఘటన సంచలనంగా మారింది. ఖమ్మం పట్టణానికి అతి సమీపంలో రామన్నపేట నుంచి కామంచికల్ రైల్వే ట్రాక్‌పై మహిళ మృత దేహం పడి ఉందన్న సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మహిళ ముఖం ఛిద్రమై ఉండడంతో దుండగులు దారుణంగా కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు.


ఆమెను హత్య చేసిన దుర్మార్గులు.. మృత దేహాన్ని అర్ధనగ్నంగా గోనెసంచిలో కుక్కి రైల్వే ట్రాక్‌పై పడేశారు. ఆమె దుస్తులు చిరిగిపోయి ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహం వద్ద ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కి 7 వ తేదీ ప్రయాణం కోసం రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్ లభ్యమైంది. ఆ టిక్కెట్ ఆరో తేదీ సాయంత్రం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైలు ఎక్కేందుకు వచ్చిన మహిళను కాపుకాసి హత్య చేశారా? లేక మరేదైనా జరిగి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రైల్వే ట్రాక్ వద్ద చీరలు పడి ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రయాణం కోసం బట్టలు సర్దుకుని వచ్చిన మహిళను చంపి పడేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల విచారణలో అసలు నిజాలు తేలాల్సి ఉంది.


Latest News
 

సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత Fri, Mar 29, 2024, 08:37 PM
మానవాళి కోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగం Fri, Mar 29, 2024, 08:36 PM
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు Fri, Mar 29, 2024, 08:34 PM
ఆపరేషన్ నిమిత్తమై రక్తం అందజేత Fri, Mar 29, 2024, 08:33 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కౌన్సిలర్లు Fri, Mar 29, 2024, 08:32 PM