కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మృతి!

byసూర్య | Wed, Jan 20, 2021, 02:27 PM

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు 108 అంబులెన్స్‌ డ్రైవర్ ‌గా పనిచేస్తున్నాడు. అతడు మంగళవారం రోజున కుంటాల పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత.. రాత్రి విఠల్ రావు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విఠల్‌ బుధవారం మృతిచెందారు. విఠల్ మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమా..? లేదా ఇంకేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.


Latest News
 

సుర్రుమంటున్న సూరీడు.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు, రెండ్రోజులు పెరగనున్న ఎండలు Tue, Apr 16, 2024, 08:25 PM
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరానికి రూ. 10 వేలు, అకౌంట్లలోకి డబ్బులు Tue, Apr 16, 2024, 08:19 PM
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ సమయాల్లో, ఆ రూట్లలో వెళ్తే ఇరుక్కుపోవటం పక్కా Tue, Apr 16, 2024, 08:12 PM
భద్రాద్రి రామయ్య కల్యాణోత్సవం.. భక్తులందరికీ ఉచిత దర్శనం Tue, Apr 16, 2024, 08:07 PM
దంచికొడుతున్న ఎండలు..ఆర్టీసీ కీలక నిర్ణయం Tue, Apr 16, 2024, 07:35 PM