byసూర్య | Tue, Jan 19, 2021, 05:28 PM
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కీలక ప్రకటన చేశారు. అంగన్ వాడీలకు త్వరలో ప్రమోషన్ లు ఇవ్వబోతున్నట్లు, ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కష్టకాలంలో, ఇబ్బందులలో కూడా పని చేస్తున్న అంగన్ వాడీ సేవలకు గుర్తింపుగా భీమా కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ విషయాలను వెల్లడించారు. అంగన్ వాడీల ద్వారా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రయోజనం అందాలని అంగన్ వాడీలకు మంత్రి దిశా నిర్ధేశం చేశారు.