byసూర్య | Tue, Jan 19, 2021, 04:42 PM
ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలోని దత్తత్రేయనగర్ కాలనీలో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సదాశివపేట పట్టణంలోని దత్తాత్రేయనగర్ కాలనీకి చెందిన గాండ్ల శ్రీలత (35)కు కూకట్పల్లిలోని నిజాంపేట్కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. శ్రీలత కంది మండలం ఎర్థనూర్, మామిడిపల్లి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించింది. ఆదివారం రాత్రి పుట్టింటికి వచ్చిన ఆమె ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సోమవారం సదాశివపేట పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.