byసూర్య | Tue, Jan 19, 2021, 02:56 PM
ఏడేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్ తన ఇంటికే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ సభ్యుడు ఇలా అన్ని ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబానికే వచ్చాయన్నారు.త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను ఒక కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని ఆరోపించారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు.మూడెకరాలు భూమి ఇస్తామన్నారు. ఈ హామీలు అమలు కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను కూల్చేయడానికి బడుగుబలహీన వర్గాల వారంతా బీజేపీలో చేరుతున్నారని అన్నారు.