byసూర్య | Tue, Jan 19, 2021, 08:36 AM
టీమ్ఇండియా ప్లేయర్ హనుమ విహారి ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆసీస్ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సందర్భంగా కెటిఆర్కి ఆసీస్ పర్యటనకు సంబంధించిన విషయాలను హనుమ విహారి వివరించాడు. కేటీఆర్ ను కలవడం, క్రికెట్ గురించి సంభాషించడం ఆనందంగా ఉందని విహారి ట్విటర్లో పేర్కొన్నాడు. కేటీఆర్తో దిగిన ఫొటోను షేర్ చేశాడు