byసూర్య | Tue, Jan 19, 2021, 08:07 AM
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 11.2 నుంచి 18.3 డిగ్రీల వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రత 31 నుంచి 35.7 డిగ్రీల వరకు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్యనారాయణపురంలో 35.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 11.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. రాగల మూడ్రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 నుంచి 16 డిగ్రీల వరకు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. తూర్పు ఆగ్నేయ దిశనుంచి వీస్తున్న గాలుల వల్ల ఒకటి రెండు చోట్ల ఉదయం వేళ పొగమంచు ఏర్పడొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. హైదరాబాద్లో రాత్రి వేళ కొంత చలి పెడుతుండగా, మధ్యాహ్నం ఉక్కపోత ఉంటున్నది.