గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరవేస్తాం: బండి సంజయ్

byసూర్య | Mon, Jan 18, 2021, 03:19 PM

2023లో జరగబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోంది గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరవేయడం ఏకైక లక్ష్యం అని రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ పరిధిలోని రాజరాజేశ్వరి గార్డెన్స్ లో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంచార్జీ ,బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎంపీలు, రాష్ట్ర పదాధి కారులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి జిల్లా నాయకులు, ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ కార్పొరేటర్ లు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గిని సేవలు అందించారు. సమావేశంలో కేవలం ఎంపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యవర్గ సభ్యులను మాత్రమే సభా ప్రాంగణంలోకి అనుమతించారు. మీడియాను సైతం అనుమతించలేదు. సమావేశం ముగింపు దశలో మీడియాను అనుమతించారు. రాష్ట్రంలో జరుగ బోవు ఎమ్మెల్సీ ఎన్నికలు,వరంగల్,ఖమ్మం తదితర నగరాలలో జరుగనున్న ఎన్నికలు, అలాగే 2023 సంవత్సర లో సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పది అంశాలపై చర్చలు జరుగగా ఆ అంశాలను ఆమోదించడం జరిగింది. ఇదిఇలా ఉండగా కంటోన్మెంట్ పరిధిలోని బీజేపీ నేతలు మాజీ బోర్డు సభ్యులు జె. రామకృష్ణ, జంపన ప్రతాప్, భానుక మల్లికార్జున్, సీనియర్ నేతలు ఆకుల నగేష్,కార్పోరేటర్లు చీర సుచిత్ర,కొంతం దీపిక తదితరులు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ ప్రాంతానికి తరలి రావడం సేవలు అందించడం జరిగింది.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM