byసూర్య | Mon, Jan 18, 2021, 12:43 PM
ధూమపానం ఆరోగ్యానికి హానికరం కానీ పొగరాయుళ్లకు కరోనా ప్రభావం తక్కువని సీఎస్ఐఆర్ నిర్వహించిన సీరో సర్వేలో వెల్లడైంది. సర్వేలో ధూమపానం,మద్యపానం,బ్లడ్ గ్రూప్,ఆహారపు అలవాట్లు,ఆరోగ్య వివరాలను సేకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 10,427 మంది నుంచి శాంపిల్స్ ను సేకరించి అందులో 1058 మందిలో కరోనా యాంటీబాడీలను గుర్తించారు. ధూమపానం చేసే వారిలో,శాఖాహారుల్లో సెరో పాజిటివిటి రేటు తక్కువగా ఉంది. ఏ,ఓ బ్లడ్ గ్రూపుల వారికంటే బీ,ఏబీ గ్రూపుల వారికి కరోనా ఇన్ ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉందని తేలింది.