byసూర్య | Mon, Jan 18, 2021, 11:40 AM
సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ 354వ జయంతి సందర్భంగా సిక్కులు ఈరోజు ర్యాలీ నిర్వహిస్తుండడంతో అఫ్జల్గంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని అడిషనల్ సీపీ అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్ గురుద్వారా సాహిబ్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలుంటాయన్నారు. ర్యాలీ సెంట్రల్ గురుద్వారా నుంచి శంకర్శేర్ హోటల్, అశోక్ బజార్, అఫ్జల్గంజ్ ఐలాండ్, అఫ్జల్గంజ్ జంక్షన్, సిద్ది అంబర్బజార్, మొజంజాహిమార్కెట్, జాంబాగ్, పుత్లీబౌలి, రామ్మందిర్ మీదుగా తిరిగి సెంట్రల్ గురుద్వారా వద్దకు చేరుకుంటుంది.