నియోజకవర్గం సమస్యలపై అధికారుల సమావేశం

byసూర్య | Sun, Jan 17, 2021, 03:16 PM

శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై, సైబ‌రాబాద్ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి అధికారులు శ‌నివారం స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో నెల‌కొన్న స‌మస్య‌ల‌పై వారు చ‌ర్చించారు. ముఖ్యంగా ర‌హ‌దారుల‌పై మార్కింగ్‌లు, రేడియం స్టిక్క‌ర్ల వెలుగు, జంక్ష‌న్ ల అభివృద్ధి, ఫుట్‌పాత్‌, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, వాట‌ర్ లాగింగ్, డ్రైనేజీ, వాట‌ర్ లీకేజీ స‌మ‌స్య‌లు త‌దిత‌ర అంశాల‌పై వారు చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో జీహెచ్ఎంసీ శేరిలింగంప‌ల్లి జ‌డ్‌సీ ర‌వికిర‌ణ్‌, సైబ‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజ‌య్ కుమార్‌, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్ర‌శేఖ‌ర్‌, టీఎస్ఐఐసీ జోన‌ల్ మేనేజ‌ర్ వినోద్‌, ఇత‌ర జీహెచ్ఎంసీ అధికారులు, ఎన్‌సీసీ లిమిటెడ్‌, జ‌ల‌మండ‌లి, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM