మహిళ మృతదేహంతో మూడు రోజులపాటు సహవాసం..చివరకు

byసూర్య | Sun, Jan 17, 2021, 02:00 PM

చుట్టపు చూపుగా వచ్చిన మహిళ తన ఇంట్లో చనిపోయింది. ఆమె మరణం తన మెడకి ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో ఓ వ్యక్తి ఆ శవంతో మూడురోజులపాటు సావాసం చేశాడు. చివరికి ఆ మహిళ శవాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని తెలకపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన కృష్ణయ్య కూతురు కళమ్మకు 20ఏళ్ల క్రితం లింగాల మండలం అవుసలికుంటకు చెందిన శేఖర్‌తో పెళ్లి చేశాడు. పెళ్లైన ఏడాదికే శేఖర్ మరణించాడు. దీంతో నాగనూలుకు చెందిన బాలపీరుకు ఇచ్చి రెండో వివాహం జరిపించారు.
బాలపీరు-కళమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. అయితే కొన్నేళ్ల క్రితం బాలపీరు కూడా మృతిచెందారు. దీంతో కళమ్మ గౌరారం చేరుకుని తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి కళమ్మను మందలించడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. అవుసలికుంట వద్ద ఒంటరిగా ఉంటున్న తన మొదటి భర్త తమ్ముడు లింగస్వామి ఇంటికి వెళ్లింది. అక్కడ ఉండగా అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం మృతిచెందింది.
అయితే కళమ్మ చనిపోవడంతో లింగస్వామి ఆందోళన చెందాడు. ఆమెను తానే చంపానని అనుకుంటారమోనన్న భయంతో లింగస్వామి ఈ విషయం ఎవరిక చెప్పలేదు. 3రోజుల పాటు కళమ్మ మృతదేహంతోనే సహవాసం చేశాడు. శనివారం ఆమె మృతదేహాన్ని గుంత తీసి పుడ్చిపెట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే గ్రామంలో మరో వ్యక్తి సాయం కోరాడు. దీంతో ఆ విషయం బయటకు తెలిసిపోయింది. కళమ్మ మృతిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

సైబర్ నేరానికి మోసపోయిన యువకుడు Fri, Apr 19, 2024, 10:14 AM
బీఎస్పీకి కొత్త మనోహర్ రెడ్డి రాజీనామా Fri, Apr 19, 2024, 10:12 AM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM