byసూర్య | Sun, Jan 17, 2021, 01:07 PM
దేశవ్యాప్తంగా రెండో రోజు కొవిడ్ – 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగురాష్ట్రాల్లోనూ టీకా పంపిణీ కార్యక్రమం సాగుతోంది. కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో అపోహలు తొలగకపోవడంతో తొలి రోజు వ్యాక్సినేషన్కి మిశ్రమ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా తొలి రోజు లక్ష్యం 3 లక్షల మంది కాగా, వ్యాక్సిన్ వేయించుకున్నది మాత్రం 1, 91, 181 మందిగా లెక్కలు తేలాయి. ఢిల్లీలో ఒక కొవిడ్ వ్యాక్సిన్ సీరియస్ రియాక్షన్, 51 సాధారణ రియాక్షన్స్ నమోదయ్యాయి. ఎయిమ్స్ ఐసీయూలో చేర్పించాల్సిన స్థాయిలో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన కేసులు బహు అరుదుగా వచ్చాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండో రోజు ఎలా జరుగుతుందో మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఈ దిగువున చూడొచ్చు.