పెళ్లి చేయమన్న కొడుకు..గొడ్డలితో నరికి చంపిన తండ్రి

byసూర్య | Sun, Jan 17, 2021, 11:19 AM

పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తున్నాడని..ఓ తండ్రి కన్న కొడుకును చంపేశాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం చేగూర్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఎల్లయ్యకు నరేష్ అనే కొడుకు ఉన్నాడు. నరేష్ తనకు వివాహం చేయాల్సిందిగా తండ్రిని పదేపదే అడిగేవాడు. ఒకానొకదశలో నరేష్ తన పెళ్లి గురించి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదే విషయంలో నరేష్, ఎల్లయ్యలు పలుమార్లు గొడవపడ్డారు.
దాంతో విసుగుచెందిన ఎల్లయ్య.. శనివారం మద్యం తాగొచ్చి కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నరేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు నరేష్‌ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. తల్లి ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM