byసూర్య | Sun, Jan 17, 2021, 11:19 AM
పెళ్లి చేయమని ఒత్తిడి చేస్తున్నాడని..ఓ తండ్రి కన్న కొడుకును చంపేశాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం చేగూర్ గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఎల్లయ్యకు నరేష్ అనే కొడుకు ఉన్నాడు. నరేష్ తనకు వివాహం చేయాల్సిందిగా తండ్రిని పదేపదే అడిగేవాడు. ఒకానొకదశలో నరేష్ తన పెళ్లి గురించి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇదే విషయంలో నరేష్, ఎల్లయ్యలు పలుమార్లు గొడవపడ్డారు.
దాంతో విసుగుచెందిన ఎల్లయ్య.. శనివారం మద్యం తాగొచ్చి కొడుకుపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు నరేష్ను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేష్ మృతి చెందాడు. తల్లి ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.