byసూర్య | Sat, Jan 16, 2021, 04:55 PM
టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని పర్యాటక, ఎక్సైజ్శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్వాడ టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్ గౌడ్ ఆధ్వర్యంలో మండలానికి చెందిన ఎండీ వహీద్ పాషా, బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ నిరంజన్తోపాటు నజీర్, ఖదీర్ పాషాతోసహా 100 మంది ఆ పార్టీ కార్యకర్తలు మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే అన్నిపార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతున్నదని మంత్రి పేర్కొన్నారు.