byసూర్య | Sat, Jan 16, 2021, 02:59 PM
ప్రాణాలకు తెగించి డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కరోనా పై యుద్ధం చేసి ప్రాణ త్యాగం కూడా చేశారన్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వారిని గుర్తు చేసుకొని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.. వారికి ముందు వాక్సిన్ అందించాలని ప్రధాని సూచించారు.. అందుకే మొదటి వాక్సిన్ సఫాయి కర్మచారి కృష్ణమ్మకే ఇచ్చాము.. అందుకే నేను ఈ రోజు వాక్సిన్ తీసుకోలేదంటూ ఈటల క్లారిటీ ఇచ్చారు.. ఐసీఎంఆర్ గైడ్ లెన్స్ ప్రకారమే కరోనా బాధితులకు వైద్యం అందించామన్న ఆయన.. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణం అన్నారు