నల్గొండలో దారుణం

byసూర్య | Sat, Jan 16, 2021, 01:45 PM

భర్త తమ్ముడితో వదినకు, ఆమె కుటుంబ సభ్యులకు గొడవలున్నాయి. అదే విషయమై పొలం వద్ద కొడుకు, అల్లుడికి గొడవ జరిగింది. తన కొడుకుని కొట్టాడంటూ మరిది పోలీస్ స్టేషన్‌కి బయల్దేరడంతో వదిన ఆగ్రహంతో రగిలిపోయింది. కూతురి భర్త, అతని కుటుంబ సభ్యులతో కలిసి మాటువేసింది. చెరువు గట్టు వద్దకు రాగానే అమాంతం కర్రలతో కొట్టి చంపేశారు. ఈ అమానుష ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. తిప్పర్తి మండలం పజ్జూరుకి చెందిన కంబాలపల్లి నాగయ్య(50)కి అతని వదిన లింగమ్మతో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. లింగమ్మ పొలంలో నుంచి నాగయ్య పొలానికి నీళ్లు రావాల్సి ఉంది. అదే విషయమై ఇరుకుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. లింగమ్మ కూతురు అదే గ్రామానికి చెందిన నాతి కిరణ్‌ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఊళ్లోనే ఉన్న అత్త లింగమ్మ భూమిని సాగు చేస్తున్నాడు.


 


రెండు రోజుల కిందట సంక్రాంతి పండుగ రోజు అదే విషయమై నాగయ్య కొడుకు ఉపేందర్‌, లింగమ్మ అల్లుడు కిరణ్‌ గొడవ పడ్డారు. ఆ విషయం ఉపేందర్ ఇంట్లో చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని నాగయ్య నిర్ణయించుకున్నాడు. కంప్లైంట్ చేసేందుకు మరిది వెళ్తున్నాడని తెలుసుకున్న వదిన లింగమ్మ మార్గంమధ్యలో వెంకటాద్రిపాలెం చెరువు వద్ద మాటువేసింది. అల్లుడు కిరణ్, అతని కుటుంబ సభ్యుల సహకారంతో తిప్పర్తి వెళ్తున్న నాగయ్యని అమానుషంగా అంతమొందించింది. అందరూ కలసి దారుణంగా కర్రలతో కొట్టి కిరాతకంగా హతమార్చారు. బంధువుల దాడిలో తీవ్రగాయాలపాలైన నాగయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


 


 


Latest News
 

రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM
చిలుకూరు బాలాజీ గరుడ ప్రసాద వితరణకు పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట Fri, Apr 19, 2024, 07:49 PM
చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ Fri, Apr 19, 2024, 07:46 PM