byసూర్య | Sat, Jan 16, 2021, 12:37 PM
పెళ్లి మండపంలోనే వరుడు కన్నీళ్లు పెట్టుకున్న ఘటన సౌదీ అరేబియాలోని జెడ్డాలో చోటు చేసుకుంది. తన పెళ్లికి తన తండ్రి హాజరు కాలేదని ఆ వరుడు భావోద్వేగానికి లోనయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కు చెందిన మహ్మద్ ఇమ్దాద్ అలీ జెడ్డాలో ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. అయితే అలీ వివాహం గతేడాది మార్చిలో జెడ్డాలోనే జరగాల్సి ఉండగా.. కరోనా లాక్ డౌన్ విధించడంతో పెళ్లి వాయిదా పడింది. దీంతో అలీ తల్లిదండ్రులు అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పటికీ కూడా వారికి వీసా రాలేదు. దీంతో పెళ్లి ఆలస్యమవుతుందని భావించి ఇరు కుటుంబాల పెద్దలు అతడి తల్లిదండ్రులు లేకుండానే నిఖా జరిపించారు. ఈ సమయంలో తండ్రిని గుర్తు చేసుకుని అలీ భావోద్వేగానికి లోనయ్యాడు. అలీ బంధువులు దాదాపు జెడ్డాలోనే స్థిరపడడంతో పెళ్లి అక్కడే జరిపించారు.