అభివృద్ది ప‌నుల‌పై మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష

byసూర్య | Fri, Jan 15, 2021, 01:49 PM

హైద‌రాబాద్ : గ‌్రామాల అభివృద్ధే ప్ర‌భుత్వ ధ్యేయ‌మ‌ని పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల‌పై అధికారులతో మంత్రి ఎర్ర‌బెల్లి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆయా శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తనియా, పంచాయితీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఈఎన్సీ పీఆర్ సంజీవ రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ త్వ‌ర‌గా వైకుంఠ‌ధామాలు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌తో పాటు పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గ్రామాల‌ను అన్ని ర‌కాలుగా అభివృద్ధి చేయాల‌న్నారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృత నిశ్చ‌యంతో ఉన్నార‌ని తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రుల స‌మావేశంలో మ‌న శాఖ‌ల ప‌నితీరును సీఎం అభినందించిన విష‌యాన్ని గుర్తు చేశారు.


 


 


 


Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM