byసూర్య | Fri, Jan 15, 2021, 01:16 PM
నల్గొండ జిల్లా చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైద్రాబాద్-విజయవాడ హైవేపై పట్టణాల్లో బారికేడ్లను పోలీసులు తొలగించారు. రోడ్డు దాటుతున్న బైకును కారు అతివేగంగా ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం సంభవించింది. బైకుపై ఉన్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సీసీ కెమెరాలో రికార్డయిన ప్రమాద దృశ్యాలు బట్టి అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.