కొమురం భీం జిల్లాలో కొలిక్కిరాని పులి వేట

byసూర్య | Fri, Jan 15, 2021, 12:35 PM

కొమురం భీం జిల్లా అటవిశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది మ్యాన్ ఈటర్. దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తూ స్పెషల్ యాక్షన్ టీంలకు సైతం టైగర్ చిక్కడంలేదు. కాగా, ఆపరేషన్ టైగర్ కు ఎన్టీసీఏ నిబంధనలు అడ్డువస్తున్నాయి. మత్తుమందు ప్రయోగానికి బ్రేక్ పడింది. మరోవైపు, ఎరను సైతం పులి చాకచక్యంగా లాక్కెళ్లి తినేస్తోంది తప్పితే పులి దొరకడం లేదు. ఏదేమైనప్పటికీ పులి కోసం అటవీ అధికారుల అన్వేషణ మాత్రం కొనసాగుతోంది. ఇక, పులి భయానికి పత్తి చేల వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు బెజ్జూర్ మండలానికి చెందిన రైతులు. అటవీ ప్రాంతాలతో పాటు పంట పొలాల వైపు సైతం ఎవరూ వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు.


దీంతో చేలలోకి ఎవరూ వెళ్లడం లేదు. అయితే, చేతికందిన పత్తి అంతా చేలోనే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు, అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పులి అన్వేషణ కొనసాగుతోంది. కాగా, నిన్న సులుగుపల్లి లో కనిపించిన పులి.. తాము టార్గెట్ చేసిన పులి ఒక్కటేనని సిఎఫ్ వినోద్ కుమార్ చెప్పారు. ఎక్కడ క్యాటిల్ కిల్ జరిగితే అక్కడికి మా టీమ్ అరగంటలో చేరుకునేలా ప్లాన్ చేసుకున్నామని ఆయన తెలిపారు.


Latest News
 

ముఖ్యమంత్రిని కలిసిన నిర్మల రెడ్డి Fri, Mar 29, 2024, 01:41 PM
దొంగతనం కేసు చేదించిన పోలీసులు Fri, Mar 29, 2024, 01:41 PM
బార్ అసోసియేషన్ కార్యదర్శిగా సురేష్ గౌడ్ Fri, Mar 29, 2024, 01:38 PM
టెట్ పరీక్ష ఫీజు తగ్గించాలి Fri, Mar 29, 2024, 01:37 PM
ఎన్నికల్లో పోటీపై తమిళిసై కీలక వ్యాఖ్యలు Fri, Mar 29, 2024, 01:37 PM