byసూర్య | Fri, Jan 15, 2021, 12:25 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా మాంసం ధరలు పెరిగిపోయాయి. సాధారణంగా కిలో మటన్ ధర రూ.500 నుంచి రూ.600 మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం కిలో మటన్ ధర రూ.800 నుండి రూ.1000 వరకు పలుకుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాంసం ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి వరుస కథనాలు వెలువడిన నేపథ్యంలో చికెన్ కు డిమాండ్ తగ్గి మటన్ కు డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేదు. వ్యాపారులు ధరలు పెంచినట్లు అంతా భావిస్తున్నారు. ఏదెమైనా పండుగ కావడంతో ధరలు పెరిగినా కూడా మాంసం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు సైతం వెనుకాడటం లేదు.