byసూర్య | Fri, Jan 15, 2021, 11:01 AM
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 19,898 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 202 పాజిటివ్ కేసులు తేలాయి. కరోనా కారణంగా నిన్న మరో ఇద్దరు మృతి చెందారు. ఇక కరోనా నుంచి 253 మంది కోలుకున్నారు.తెలంగాణలో ఇప్పటి వరకు 2,91,118 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇందులో ఇప్పటికే 2,85,102మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. అటు ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 1,574 మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,442 ఉంది. ఇందులో 2,541 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 73.99 లక్షల కరోనా టెస్టులు నిర్వహించారు.